Telugu Global
Andhra Pradesh

పవన్ వల్ల అదృశ్యమైన అమ్మాయిల లెక్క తేలాలి..

అసలు ఏపీలో పవన్ కల్యాణ్ వల్ల అదృశ్యమైన అమ్మాయిల లెక్క తేలాలన్నారు. మహిళల అదృశ్యంపై పవన్ కి ఏ నిఘా సంస్థ నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు రోజా.

పవన్ వల్ల అదృశ్యమైన అమ్మాయిల లెక్క తేలాలి..
X

ఏపీలో అదృశ్యమైన బాలికలు, యువతుల సంఖ్య ఇదీ అంటూ ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ చెప్పిన లెక్కలతో పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ వేశారు. తప్పిపోయిన వారిలో చాలామంది తిరిగొచ్చారని, ఆ విషయాన్ని పవన్ ఎందుకు గుర్తించలేదని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఏపీ మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది, పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. తాజాగా మంత్రి రోజా కూడా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో పవన్ కల్యాణ్ వల్ల అదృశ్యమైన అమ్మాయిల లెక్క తేలాలన్నారు. మహిళల అదృశ్యంపై పవన్ కి ఏ నిఘా సంస్థ నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు రోజా.

ఏపీలో గంజాయి తప్ప మిగతా ఏ పంటకూ సరైన మార్కెట్ లేదంటూ ఇటీవల చంద్రబాబు చేసిన విమర్శలపై కూడా మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. గంజాయి హెరిటేజ్ లో మాత్రమే దొరుకుతుందని, రాష్ట్రంలో ఇంకెక్కడా దొరకడంలేదని ఆరోపించారు. నారావారిపల్లిలో ఎర్రచందనం వ్యాపారం సాగుతోందన్నారు. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు రోజా.

ఆ అర్హత ఉందా..?

రాయలసీమ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదన్నారు మంత్రి రోజా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టులు అప్పుడెందుకు గుర్తు రాలేదన్నారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఆయన ఏనాడూ కనిపెట్టలేదన్నారు.

First Published:  28 July 2023 11:16 AM GMT
Next Story