Telugu Global
Andhra Pradesh

విజను, విస్తరాకుల కట్ట..

మాట్లాడితే సెల్ ఫోన్ కనిపెట్టా, కంప్యూటర్ కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకుంటుంటారని, అసలు ఆయన ఏపీకి ఏం చేశారని నిలదీశారు మంత్రి రోజా.

విజను, విస్తరాకుల కట్ట..
X

చంద్రబాబుకి విజనూ లేదు, విస్తరాకుల కట్టా లేదు అంటూ మండిపడ్డారు మంత్రి రోజా. అలా మాయమాటలు చెబుతూ చంద్రబాబు ఇన్నాళ్లూ రాజకీయాలు చేశారని, ఇప్పుడు ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారని చెప్పారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ శంకుస్థాప కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఏపీకి నిజమైన పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని చెప్పారు. పని మనుషులు, డ్రైవర్లతో MOUలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తమ హయాంలో 13లక్షల కోట్ల రూపాయలకు నిజమైన ఎంఓయూలు జరిగాయని చెప్పారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలనే పారిశ్రామిక ప్రగతిగా డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు రోజా.


ఏపీకి ఏం చేశావయ్యా..?

మాట్లాడితే సెల్ ఫోన్ కనిపెట్టా, కంప్యూటర్ కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకుంటుంటారని, అసలు ఆయన ఏపీకి ఏం చేశారని నిలదీశారు మంత్రి రోజా. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు రోజా. సీఎం జగన్ పై ఉన్న నమ్మకంతోనే పారిశ్రామిక వేత్తలు ఇక్కడ వ్యాపారాలకోసం వస్తున్నారని చెప్పారు.

జగనన్న వన్స్ మోర్..

వైఎస్ జగన్ అంటే అది కేవలం పేరు మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని అన్నారు మంత్రి రోజా. రికార్డులు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్‌ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగనన్న వన్స్‌మోర్ అని ప్రజలు అంటున్నారని, తప్పకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ధీమాగా చెప్పారు.

First Published:  9 July 2023 12:06 PM GMT
Next Story