Telugu Global
Andhra Pradesh

ప్ర‌జ‌ల‌కు మీరు ఏంచేశారో ఇంటింటికీ వెళ్లి చెప్పే ద‌మ్ముందా?.. - చంద్ర‌బాబుకు మంత్రి రోజా స‌వాల్‌

జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్‌.. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్న.. పేరుతో రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి జ‌నం సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నారని రోజా చెప్పారు.

ప్ర‌జ‌ల‌కు మీరు ఏంచేశారో ఇంటింటికీ వెళ్లి చెప్పే ద‌మ్ముందా?.. - చంద్ర‌బాబుకు మంత్రి రోజా స‌వాల్‌
X

గ‌త ఐదేళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌కు మీరు ఏం చేశారో ఇంటింటికీ వెళ్లి చెప్పే ద‌మ్ముందా అని ఏపీ మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును స‌వాల్ చేశారు. మంత్రి రోజా మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఏ సీఎం చేయ‌లేని విధంగా జ‌గ‌నన్న ప్ర‌జా స‌ర్వే చేస్తున్నార‌ని తెలిపారు. జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్ అని ప్ర‌జ‌లు బ‌లంగా చెబుతున్నార‌ని చెప్పారు.

రాష్ట్రానికి ప‌ట్టిన ద‌రిద్రం, సైతాన్ చంద్ర‌బాబేన‌ని మంత్రి రోజా తెలిపారు. ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని, ల‌క్షా 50 వేల కోట్ల ఆస్తుల‌ను నాశ‌నం చేశాడ‌ని దుయ్య‌బ‌ట్టారు.

జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్‌.. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్న.. పేరుతో రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి జ‌నం సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నారని రోజా చెప్పారు. రానున్న ఎన్నిక‌ల్లో కుప్పంలో కూడా చంద్ర‌బాబుకు ఓట‌మి త‌ప్ప‌ద‌ని మంత్రి రోజా స్ప‌ష్టం చేశారు.

First Published:  11 April 2023 8:58 AM GMT
Next Story