Telugu Global
Andhra Pradesh

కాల్చాల్సింది జీవోని కాదు.. బాబు బుద్ధిని - కుప్పంలోనూ టీడీపీ జెండా పీకేయ‌డం ఖాయం: మంత్రి పెద్దిరెడ్డి

చంద్ర‌బాబు క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తి అని మంత్రి పెద్దిరెడ్డి విమ‌ర్శించారు. గ‌తంలో వైఎస్సార్ పైన‌, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పైన, మంత్రులపైన ఏడుస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

కాల్చాల్సింది జీవోని కాదు.. బాబు బుద్ధిని  - కుప్పంలోనూ టీడీపీ జెండా పీకేయ‌డం ఖాయం: మంత్రి పెద్దిరెడ్డి
X

సంక్రాంతి పండుగ నాడు చంద్ర‌బాబు నాయుడు నీచ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. గోదావ‌రి పుష్క‌రాల్లో షూటింగ్ కోసం 29 మందిని, మొన్న కందుకూరులో 8 మందిని, గుంటూరులో ముగ్గురిని పొట్ట‌న‌బెట్టుకొని.. మ‌ళ్లీ వారిపైనే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రోడ్ల‌పైన‌, ఇరుకు సందుల్లో స‌భ‌లు పెట్టి జ‌నాన్ని చంపుతుంటే.. జీవో నంబ‌ర్ 1ని తెచ్చామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండే జీవోను భోగి మంట‌ల్లో కాల్చుతారా? ప్ర‌జ‌ల ప్రాణాలంటే మీకు లెక్క‌లేదా అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాల్చాల్సింది జీవోను కాద‌ని, బాబు బుద్ధిన‌ని చెప్పారు. శ‌నివారం చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం య‌ర్రాతివారిప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

చంద్ర‌బాబు క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తి అని మంత్రి పెద్దిరెడ్డి విమ‌ర్శించారు. గ‌తంలో వైఎస్సార్ పైన‌, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పైన, మంత్రులపైన ఏడుస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేయ‌డం ఖాయ‌మ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పారు. అప్పుడు కూడా చంద్ర‌బాబు ఏడ‌వాల్సిందేన‌ని ఆయ‌న తెలిపారు.

First Published:  15 Jan 2023 7:00 AM GMT
Next Story