Telugu Global
Andhra Pradesh

మీ ఇద్దరిలో ఎవరు జీరోనో ముందు తేల్చుకోండి..

పురందేశ్వరి అవినీతి కూడా త్వరలోనే బయటికొస్తుందని మంత్రి కొట్టు చెప్పారు. పురందేశ్వరి వందల కోట్లు దోచుకున్న దానిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో విపులంగా మాట్లాడారని తెలిపారు.

మీ ఇద్దరిలో ఎవరు జీరోనో ముందు తేల్చుకోండి..
X

తెలుగుదేశం పార్టీ ప్రజల సానుభూతి కోసం ఎన్ని డ్రామాలు ఆడినా రక్తికట్టలేదని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రజలు అమాయకులు కాదని, తెలుగుదేశం చెప్పే మాటలకు ఎల్లకాలం మోసపోరన్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతంపై టీడీపీ, జనసేనలు కాకి లెక్కలు చెబుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు జైలుకు వెళ్ళాక తెలుగుదేశం జీరో అయిపోయిందని జనసేన కార్యకర్తలు చెబుతుంటే.. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి జనసేన జీరోలో ఉందని తెలుగుదేశం కార్యకర్తలు చెబుతున్నారన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు జీరోనో ముందు తేల్చుకోవాలన్నారు మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌.

పురందేశ్వరి అవినీతి కూడా త్వరలోనే బయటికొస్తుంది..

పురందేశ్వరి అవినీతి కూడా త్వరలోనే బయటికొస్తుందని మంత్రి కొట్టు చెప్పారు. పురందేశ్వరి వందల కోట్లు దోచుకున్న దానిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో విపులంగా మాట్లాడారని తెలిపారు. ఎన్టీఆర్‌ బిడ్డలు ఆయ‌న‌ చివరి రోజుల్లో వ్యవహరించిన తీరు పట్ల ఎంతో దుఃఖించారని ఈ సందర్భంగా మంత్రి కొట్టు చెప్పారు. రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని దోచేసే లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు.

First Published:  5 Nov 2023 3:40 AM GMT
Next Story