Telugu Global
Andhra Pradesh

తోలుబొమ్మలాటలో జోకర్.. పవన్ గురించి కాకాణి ఘాటు వ్యాఖ్యలు

జనసేన పార్టీని, ఆ పార్లీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ను తాము అసలు గుర్తించడం లేదన్నారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

తోలుబొమ్మలాటలో జోకర్.. పవన్ గురించి కాకాణి ఘాటు వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమేనని అన్నారు. కోడిగుడ్డుపై ఈకలు పీకడమే ఆయన పని అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల జగన్ యాత్రలపై జనసేన కార్టూన్లు, నెమలి పింఛాల దండ విషయంలో కౌంటర్లివ్వడంపై కాకాణి పరోక్షంగా స్పందించారు. జనసేన పార్టీని, ఆ పార్లీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ను తాము అసలు గుర్తించడం లేదన్నారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

చంద్రబాబు చేసిన తప్పులు గుర్తులేవా..?

టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి. కాకి లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేసిన విషయం ఆ పత్రికలకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం చేసిందని, తమ ప్రభుత్వం హయాంలో కరువు మండలాలు ప్రకటించే అవసరం, అవకాశం రెండూ లేవన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని, వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

రోజుకో నాలుక..

చంద్రబాబు నాలుక మడతేసే రకం కాదని, నాలుక మార్చేసే రకం అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి కాకాణి. ఆయన రోజుకో నాలుక తగిలించుకుని మాట్లరాడతారన్నారు. తాము నిజాలు చెప్తుంటే తట్టుకోలే కుక్కలతో మొరిగిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదని, అందుకే లోకేష్‌ యాత్రకు పక్క రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకొస్తున్నారని చెప్పారు కాకాణి. సీఎం జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. 175కి 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా? సీఎం జగన్‌ సవాల్‌ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గుడని ప్రజలందరికీ తెలుసని, ఆయన నీతి, నిజాయితీ లేని నాయకుడని అన్నారు.

First Published:  1 March 2023 4:20 PM GMT
Next Story