Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లదే దండుపాళ్యం బ్యాచ్‌..

ప‌వ‌న్ ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని, టీడీపీ అక్ర‌మాల‌పై గ‌తంలో ప‌వ‌న్ ఎందుకు నిల‌దీయ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లదే దండుపాళ్యం బ్యాచ్‌..
X

వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. అంటూ విశాఖ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లే దండుపాళ్యం బ్యాచ్ అని ఆయ‌న విమ‌ర్శించారు. ఆదివారం ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే విశాఖ‌ప‌ట్నంలో దందాలు జ‌రిగాయ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. గీతం కాలేజీ అక్ర‌మాల‌పై ప‌వ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని నిల‌దీశారు. ప‌వ‌న్ ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని, టీడీపీ అక్ర‌మాల‌పై గ‌తంలో ప‌వ‌న్ ఎందుకు నిల‌దీయ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ భ‌వ‌న నిర్మాణాల‌పై ప‌వ‌న్‌కు ఉన్న అభ్యంత‌రం ఏమిట‌ని ఆయ‌న నిలదీశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వానికి పేరు రాకూడ‌ద‌నేదే ప‌వ‌న్ తాప‌త్ర‌య‌మ‌ని మంత్రి అమ‌ర్నాథ్ చెప్పారు. తాను ఎన్నో పుస్త‌కాలు చ‌దివాన‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. జ్ఞానం వ‌చ్చే పుస్త‌కాలు చ‌దివుంటే బాగుండేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. చిరంజీవి చెప్పిన‌ట్టు ఫేస్ లెప్ట్ ట‌ర్నింగ్ ఇచ్చుకుంటే గీతం కాలేజీ క‌నిపించేద‌ని మంత్రి చెప్పారు. బాబు బంధువు కాబ‌ట్టే గీతం కాలేజీ అక్ర‌మాలు ప‌వ‌న్‌కు క‌న‌బ‌డ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

First Published:  13 Aug 2023 6:26 AM GMT
Next Story