Telugu Global
Andhra Pradesh

అందుకే.. ప్ర‌జ‌లు బాబును హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారు.. - మంత్రి బొత్స

మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా ప్ర‌య‌త్రాలు చేస్తున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

అందుకే.. ప్ర‌జ‌లు బాబును హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారు.. - మంత్రి బొత్స
X

హోల్‌సేల్‌గా అవినీతి చేశాడు కాబ‌ట్టే.. చంద్ర‌బాబు నాయుడును ప్ర‌జ‌లు హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. మూడు రాజ‌ధానులే త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని, వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా ప్ర‌య‌త్రాలు చేస్తున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

విజ‌య‌వాడ‌లో గురువారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను అస‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

First Published:  16 Feb 2023 11:20 AM GMT
Next Story