Telugu Global
Andhra Pradesh

ఢిల్లీ వెళ్లిన వారాహి బ్యాచ్.. అంబటి సెటైర్లు..

పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ని వారాహి బ్యాచ్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. వారాహి బ్యాచ్ ఢిల్లీ వెళ్లింది దేనికోసం అని ప్రశ్నించారు.

ఢిల్లీ వెళ్లిన వారాహి బ్యాచ్.. అంబటి సెటైర్లు..
X

పోలవరం విషయంలో జనసేన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. కేంద్ర జలశక్తి మంత్రికి జనసేన నేతలు అర్జీ ఇవ్వడం, బయటకొచ్చి పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని రాద్ధాంతం చేయడం.. ఇవన్నీ కేవలం డ్రామాలని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని, రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసలు నాదెండ్ల మనోహర్ కు పోలవరం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్నారు. పోలవరంపై అవాకులు చెవాకులు పేలొద్దంటూ హితవు పలికారు.

వారాహి బ్యాచ్ ఢిల్లీ వెళ్ళింది దేనికోసం..

పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ని వారాహి బ్యాచ్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. వారాహి బ్యాచ్ ఢిల్లీ వెళ్లింది దేనికోసం అని ప్రశ్నించారు. బీజేపీతో విడాకుల కోసమా..? సంసారం కోసమా..? చెప్పాలన్నారు. చంద్రబాబు పంపిస్తేనే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని చెప్పారు.

శృంగభంగం తప్పదు..

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కు శృంగభంగం తప్పదన్నారు మంత్రి అంబటి రాంబాబు. బీజేపీతో పవన్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఆయన సిద్ధాంతం ఏంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అజ్ఞానంతో ఉన్నారని చెప్పారు. ఓట్లు చీలకూడదు అని చెబుతున్న పవన్, అసలు ఢిల్లీ వెళ్లి ఏం చేశారన్నారు. ఓట్లు చీలకుండా పవన్ ఏం చేయగలడు అని ప్రశ్నించారు.

First Published:  6 April 2023 2:28 PM GMT
Next Story