Telugu Global
Andhra Pradesh

రూ.400 కోట్లు నీటిపాలు చేసిన చంద్రబాబు.. అంబటి ధ్వజం..

రూ.400 కోట్లు నీటిపాలు చేసిన చంద్రబాబు.. అంబటి ధ్వజం..
X

టీడీపీ హయాంలో చేసిన ఘోరమైన తప్పుల వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అన్నారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. 400 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాల్ వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పారు. టీడీపీ హయాంలో కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారని, ప్రపంచంలో ఎవరూ ఇలాంటి పని చేయరని అన్నారు. చంద్రబాబు తెలివి తక్కువతనం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పారు అంబటి. టీడీపీ తెలివి తక్కువత‌నం డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి కారణమైందని మంత్రి అంబటి ధ్వజమెత్తారు.

టీడీపీ నేతలు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని మండిపడ్డారు అంబటి రాంబాబు. ఏమయ్యా రాంబాబు అంటూ దేవినేని ఉమా వెటకారంగా మాట్లాడుతున్నారని, మరోసారి అలా అంటే.. తాను కూడా ఒరేయ్ తురేయ్ అనాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. పోలవరం నిర్మాణం జరుగుతున్నా.. లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం జరగకుండా కంటికి రెప్పలా కాపాడాం అని చెప్పారు అంబటి.

దొంగలు పడ్డ ఆర్నెళ్లకు..

దొంగలు పట్ట ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా చంద్రబాబు వరద ప్రాంతాలకు ఇప్పుడు వెళ్లడం ఏంటని మండిపడ్డారు అంబటి. ప్రజల్ని రెచ్చగొట్టే కామెంట్లు చేయొద్దని హితవు పలికారు. చంద్రబాబుకి వరద బాధితులపై ప్రేమలేదని, కేవలం రాజకీయ కారణాలతోనే ఆయన వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు అంబటి.

ఆరోగ్య శాఖ మంత్రిని ఆపరేషన్ చేయమంటారా..?

తాను జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, డయాఫ్రమ్ వాల్ గురించి తెలియదని చెప్పానని, ఇప్పుడు అన్నీ తెలుసుకుని సాధికారికంగా మాట్లాడుతున్నానని చెప్పారు అంబటి. "నేను కాంట్రాక్టర్‌నా? ఇంజనీర్‌నా? అన్నీ తెలియడానికి" అంటూ ప్రశ్నించారు. "ఆరోగ్య శాఖ మంత్రికి ఆపరేషన్ చేయటం రావాలా? ఎదుటి వాళ్ళను గేలి చేయాలని ప్రయత్నించటం దుర్మార్గం" అని అన్నారు అంబటి.

First Published:  21 July 2022 9:02 AM GMT
Next Story