Telugu Global
Andhra Pradesh

తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపి తిన్న సింహం

దారుణ ఘ‌ట‌న‌లో మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్ (34)గా గుర్తించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. అనేదానిపై ఎవ‌రూ పూర్తిగా చెప్ప‌లేక‌పోతున్నారు.

తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపి తిన్న సింహం
X

తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో పెనువిషాదం చోటుచేసుకుంది. జూపార్క్‌‌లోని సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అందులో ఉన్న సింహం వెంట‌నే అత‌ణ్ని చంపేసింది. అంత‌టితో ఆగ‌కుండా త‌ల వ‌ర‌కు మొత్తం తినేసింది. దీంతో ఆ సింహాన్ని జూ అధికారులు బోన్‌లో బంధించారు.

మృతుడు రాజ‌స్థాన్ వాసి

దారుణ ఘ‌ట‌న‌లో మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్ (34)గా గుర్తించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. అనేదానిపై ఎవ‌రూ పూర్తిగా చెప్ప‌లేక‌పోతున్నారు. ఆ వ్యక్తి కావాలనే సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకి ఉంటాడ‌ని జూ అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ద్యం మ‌త్తులో అత‌ను ఎన్‌క్లోజర్‌లో దూకిన‌ట్టు భావిస్తున్నారు. జూ పార్క్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.




First Published:  15 Feb 2024 12:22 PM GMT
Next Story