Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు

ఎన్టీఆర్ చనిపోవాలని ఆయన కుమార్తె భువనేశ్వరి అప్పట్లో క్షుద్రపూజలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి. ఆ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడ్డారని అన్నారు.

ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు
X

చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈరోజు లక్ష్మీపార్వతి మళ్లీ తెరపైకి వచ్చారు. చంద్రబాబు కుటుంబాన్ని, ఎన్టీఆర్ సంతానాన్ని ఆమె టార్గెట్ చేశారు. ముఖ్యంగా పురందేశ్వరి, భువనేశ్వరిపై ఆమె విమర్శలతో విరుచుకుపడ్డారు. తండ్రికి తిండిపెట్టని వీరంతా ఇప్పుడు ఆయన పేరు తలచుకుంటున్నారని మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని భువనేశ్వరి జనంలోకి వస్తుందని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.

ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు..

ఎన్టీఆర్ చనిపోవాలని ఆయన కుమార్తె భువనేశ్వరి అప్పట్లో క్షుద్రపూజలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి. ఆ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడ్డారని అన్నారు. బతికున్నప్పుడు ఆయన్ను అస్సలు పట్టించుకోలేదని, తనని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నప్పుడు చూడటానికి కూడా ఎవరూ రాలేదన్నారు. కొడుకు లోకేష్ సీఎం కావాలంటూ దేవాలయాల్లో భువనేశ్వరి క్షుద్రపూజలు చేశారంటూ మండిపడ్డారు. ఓ అవినీతిపరుడి భార్య, మరో అవినీతిపరుడుకి తల్లి అనే పేరు భువనేశ్వరి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

ఆయన కడుపున చెడబుట్టారు..

ఎన్టీఆర్ మహానుభావుడని, కారణ జన్ముడని.. కానీ ఆయన జన్మనిచ్చినవారు మాత్రం పనికిమాలినవారుగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. ఆయనకు ఏ జన్మ శాపమో.. ఇలాంటి సంతానం కలిగారని అన్నారు. ఆయన కడుపున పుట్టాల్సినవారు కాదని అన్నారు. ఆయన చనిపోవడానికి కూడా కారణం వారేనన్నారు. మానసికంగా క్షోభ పెట్టి చివరకు ఆయన చావుకి కారణం అయ్యారని విమర్శించారు. చంద్రబాబు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు లక్ష్మీపార్వతి.

First Published:  2 Oct 2023 12:36 PM GMT
Next Story