Telugu Global
Andhra Pradesh

ABN రిపోర్టర్‌పై దాడి.. స్పందించిన కొడాలి నాని

జగన్‌ సైకో, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ABN, టీవీ-5, ఈటీవీ, పౌడర్ డబ్బా మహాన్యూస్ ఛానల్ ప్రచారం చేస్తున్నాయన్నాని మండిపడ్డారు.

ABN రిపోర్టర్‌పై దాడి.. స్పందించిన కొడాలి నాని
X

రాప్తాడు సిద్ధం సభలో ABN రిపోర్టర్‌ జరిగిన దాడిపై స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని. ABN రిపోర్టర్‌ను కొట్టే వదిలేశారని.. రామోజీరావో, రాధాకృష్ణ వచ్చి ఉంటే ఏ కీలుకు ఆ కీలుకు విరిచేసేవాళ్లంటూ కామెంట్ చేశారు నాని.

రాప్తాడు సభకు 10 లక్షల మంది వచ్చారని, వారిని ఆపడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. జగన్‌ సైకో, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ABN, టీవీ-5, ఈటీవీ, పౌడర్ డబ్బా మహాన్యూస్ ఛానల్ ప్రచారం చేస్తున్నాయన్నాని మండిపడ్డారు. లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరైన సభకు హాజరవడం వారితప్పేనన్నారు నాని.


పైగా ఆ ఛానళ్లను వైసీపీ బహిష్కరించిందన్నారు కొడాలి నాని. వైసీపీకి సంబంధించిన సభలకు ఆ నాలుగు ఛానళ్ల లోగోలు పట్టుకురావొద్దని సూచించారు. లక్షల మంది హాజరైన సభలో ఆపడం కష్టమన్నారు.

First Published:  20 Feb 2024 3:51 AM GMT
Next Story