Telugu Global
Andhra Pradesh

ఎండ‌లు మండుతున్న వేళ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. - 17 వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు

వ‌డ‌గాలుల‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.

ఎండ‌లు మండుతున్న వేళ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. - 17 వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు
X

వేస‌వి సెల‌వులు పూర్త‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోమ‌వారం నుంచే పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వేస‌వి ఎండ‌ల తీవ్ర‌త త‌గ్గ‌లేదు. గ‌త కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోద‌వుతున్నాయి. వ‌డ‌గాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌ర‌గ‌తులు ఉద‌యం 7.30 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని ఆదేశాలిచ్చింది.

వ‌డ‌గాలుల‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

First Published:  11 Jun 2023 7:14 AM GMT
Next Story