Telugu Global
Andhra Pradesh

లోకేష్‌ది నాకంటే చాలా తక్కువ స్థాయి..

టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని కేశినేని నాని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్‌.. తన కంటే చాలా తక్కువని ఆయన తెలిపారు.

లోకేష్‌ది నాకంటే చాలా తక్కువ స్థాయి..
X

రాష్ట్ర‌ ప్రజలంతా వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టంచేశారు. శనివారం ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్‌ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందిస్తూ.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్‌ చేసిన తర్వాత మాట్లాడుతానని చెప్పారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైసీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ పిలుపుతో వెంటనే వైసీపీలో చేరానని వివరించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని కేశినేని నాని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్‌.. తన కంటే చాలా తక్కువని ఆయన తెలిపారు.

First Published:  20 Jan 2024 2:03 PM GMT
Next Story