Telugu Global
Andhra Pradesh

బాబును, పవన్‌ను, కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ఎవరూ లేరు

విశాఖపట్నానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు తనపై ఫుడ్‌ పాయిజన్‌ చేయించారని పాల్‌ తెలిపారు. దీనిపై నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.

బాబును, పవన్‌ను, కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ఎవరూ లేరు
X

ఏపీలో చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ ను, కాంగ్రెస్‌ పార్టీని నమ్మే స్థితిలో ప్ర‌జ‌లెవరూ లేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీనే అని ఆయన విమర్శించారు. అలాంటి పార్టీలో చేరి షర్మిల తప్పు చేశారని ఆయన తెలిపారు.

వైఎస్‌ని, ఆయన కొడుకుని కూడా వేధించారు..

విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేఏ పాల్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే షర్మిలను కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేవారని చెప్పారు. వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ ఎవరినీ బతకనివ్వదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ బతికున్నప్పుడు సోనియా గాంధీ ఆయనకు నిత్యం నరకం చూపించిందని చెప్పారు. ఆయన మృతిచెందిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ను 16 నెలలు జైలులో పెట్టించి వేధించిందని గుర్తుచేశారు.

నాపై ఫుడ్‌ పాయిజన్‌ చేయించారు..

విశాఖపట్నానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు తనపై ఫుడ్‌ పాయిజన్‌ చేయించారని పాల్‌ తెలిపారు. దీనిపై నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తాను ఫుడ్‌ పాయిజన్‌ ప్రభావం నుంచి బయటపడటానికి 10 రోజులుగా చికిత్స చేయించుకుంటున్నానని పాల్‌ వివరించారు. తనపై ఫుడ్‌ పాయిజన్‌ చేయించినవారి పేర్లు త్వరలో బయటపెడతానని ఆయన స్పష్టంచేశారు. టికెట్ల కోసం గుంటూరులో ఎన్‌ఆర్‌ఐలు చంద్రబాబుకు రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ నాయకుడని ఆయన విమర్శించారు.

First Published:  6 Jan 2024 3:15 AM GMT
Next Story