Telugu Global
Andhra Pradesh

ప్యాకేజీ మీ అమ్మ మొగుడు ఇచ్చాడా రా..? వాడో నీచ్ కమీన్ కుత్తే గాడు..

సినిమాల్లో కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ కు ప్యాకేజీలు తీసుకోవాల్సిన ఖర్మ పట్టలేదన్నారు. వైసీపీకి భావ దారిద్రం పట్టుకుందని, అందుకే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్యాకేజీ మీ అమ్మ మొగుడు ఇచ్చాడా రా..? వాడో నీచ్ కమీన్ కుత్తే గాడు..
X

వైసీపీ, జనసేన మధ్య దూషణలపర్వం కొనసాగుతోంది. రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థుల్లా కాకుండా వ్యక్తిగత శత్రుత్వంతో రగిలిపోతున్నట్టుగా రాజకీయం చేస్తున్నాయి. చిరంజీవి సోదరుడు, జనసేన నేత నాగబాబు మరోసారి వైసీపీ నేతలపై దూషణలకు దిగారు.

తన సోదరుడు పవన్ కల్యాణ్ ను వైసీపీ నాయకులు పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ ఉండటాన్ని నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తన సోదరుడిని ప్యాకేజీ కల్యాణ్ అనడంపై స్పందించిన నాగబాబు "మీ అమ్మ మొగుడు ఇచ్చాడా రా ?ప్యాకేజ్ "అంటూ ఘాటుగా మాట్లాడారు. " మీ అమ్మ మొగుడు ఇచ్చాడా రా? లేక మీ తాతలు వచ్చి పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ ఇచ్చార్రా? " అంటూ ఫైర్ అయ్యారు.

సినిమాల్లో కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ కు ప్యాకేజీలు తీసుకోవాల్సిన ఖర్మ పట్టలేదన్నారు. వైసీపీకి భావ దారిద్రం పట్టుకుందని, అందుకే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తామేమి వైసీపీ నాయకుల్లా వేలకోట్లు దోచుకోలేదని, తమకు ఉన్న సంపదలోనే ఇతరులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ కాపులను టీడీపీకి తాకట్టు పెట్టేశాడు.. రిప్ కాపులు.. కంగ్రాట్స్ కమ్మలు అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పైన నాగబాబు ఫైర్ అయ్యారు .

రాంగోపాల్ వర్మ అనే వాడు ఒక పెద్ద వెధవ అంటూ మాట్లాడారు. రాంగోపాల్ వర్మ అనే వాడు అవసరానికి ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి అని, వర్మ లాంటి నీచ్ కమీన్ కుత్తే గాడు తెలుగు చిత్ర పరిశ్రమలోనే లేడని ధ్వ‌జ‌మెత్తారు. వైసీపీ నాయకులు మనుషులను ఎంత చులకనగా చూస్తారో వర్మ ట్వీట్ లను బట్టి అర్థమవుతుంది అన్నారు. ఏ కులం వారైనా ఆత్మగౌరవం వదిలేసి మరో కులానికి ఎలా అమ్ముడుపోతారని నాగబాబు ప్రశ్నించారు.

ఇదే కాపులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని గెలిపించారని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని గెలిపించారని, అడ్డమైన మాటలు మాట్లాడుతున్న ఈ వైసీపీ అడ్డ గాడిదల్ని గెలిపించింది కూడా వారేనని నాగబాబు వ్యాఖ్యానించారు. తమ సామాజిక వర్గమే కాకుండా మరో సామాజిక వర్గం కూడా అమ్ముడు పోతుంది అన్న ఆలోచన తమ పార్టీకి లేదన్నారు. కాపుల్ని తాకట్టు పెట్టే హక్కు తమకే కాదు మరెవరికి ఉండదన్నారు. వైసీపీ నేతలకు కుల అహంకారం తలకెక్కి కాపులను అమ్ముడుపోయే వారిలాగా మాట్లాడుతున్నారని నాగబాబు ఫైర్ అయ్యారు.

First Published:  11 Jan 2023 5:21 PM GMT
Next Story