Telugu Global
Andhra Pradesh

జగ్గంపేటలో జ్యోతులను గెలవనివ్వం - జనసేన నేత పాఠంశెట్టి

జగ్గంపేట టికెట్‌ను జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు.

జగ్గంపేటలో జ్యోతులను గెలవనివ్వం - జనసేన నేత పాఠంశెట్టి
X

ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీల్లో ఎగసిన అసమ్మతి చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మిత్రపక్షానికి సహకరించేది లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. తణుకు జనసేన ఇన్‌ఛార్జి విడివాడ శపథం మరువక ముందే జగ్గంపేటలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

జగ్గంపేట టికెట్‌ను జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో సూర్యచంద్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలో సామాన్యులకు పోటీ చేసే అవకాశం లేదంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇక తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు పాఠంశెట్టి. జగ్గంపేటలో జ్యోతులను గెలవనివ్వమంటూ ప్రకటన చేశారు. జగ్గంపేట నుంచి పవన్ పోటీ చేస్తే లక్షమెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో జనసేనకు ఓటు వేయాలని ప్రచారం చేశామని..కానీ చివరకు టీడీపీకి టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు పాఠంశెట్టి.

First Published:  28 Feb 2024 7:12 AM GMT
Next Story