Telugu Global
Andhra Pradesh

చేపలు అమ్మే అమ్మాయిని మోసం చేసింది నిజం కాదా చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

చేపలు అమ్మే అమ్మాయిని మోసం చేసింది నిజం కాదా చంద్రబాబు
X

టీడీపీ అధ్యక్షుడుచంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌ కుటుంబసభ్యులను టార్గెట్‌గా చేసుకుని ఇటీవల టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అసలు చంద్రబాబు కుటుంబ చరిత్ర ఏంటని కాకాణి ప్రశ్నించారు. అసలు నారా లోకేష్ అనేవాడు ఎవడు అని మంత్రి ప్రశ్నించారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడై ఉండి బహిరంగ వేదిక మీద ఫేక్ నా కొడుకులు అంటూ మాట్లాడారని.. ఇదేనా చంద్రబాబు తన కుమారుడికి నేర్పిన సంస్కారం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోంది కాబట్టే, జగన్ మంచివాడు కాబట్టే నారా లోకేష్ కావలి వరకు వచ్చి అందరినీ తిట్టి వెనక్కు వెళ్లగలిగారని మంత్రి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు... రాత్రి వేళల్లో వెళ్లి రైతుల వేరుశనగ బస్తాలను దొంగతనం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు చేపలు అమ్ముకునే అమ్మాయిని మోసం చేసి ఆమె దగ్గర డబ్బులు తీసుకుని చదువుకున్నది నిజం కాదా అని నిలదీశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు చిల్లర దొంగతనాలు చేసేవారన్నది అందరికీ తెలుసన్నారు.

పిల్లోడు లోకేష్ తెలిసితెలియక మాట్లాడుతున్నట్టుగా ఉన్నారని.. అతడిని అదుపు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు అఖిల భారత దరిద్రుల సంఘాలకు అధ్యక్షులుగా పనికి వస్తారే గానీ రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా పనికి రారన్నారు.

First Published:  8 Sep 2022 8:33 AM GMT
Next Story