Telugu Global
Andhra Pradesh

పార్టీపై కన్నేసిన బాలకృష్ణ.. కీలక వ్యాఖ్యలు

`నేను వస్తున్నా.. నేను ముందుంటా` అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇకపై తెలుగువాడి సత్తా ఏంటో చూపిద్దామన్నారు.

పార్టీపై కన్నేసిన బాలకృష్ణ.. కీలక వ్యాఖ్యలు
X

చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చర్చనీయాంశంగా నిలిచాయి. ``ఇక నేనే ముందుంటా..`` అని బాల‌య్య‌ ప్రకటించడం పలు అనుమానాల‌కు తావిస్తోంది. నిన్నటి నుంచే టీడీపీ ఆఫీస్‌లో సీనియర్ నేత‌ల‌తో సమీక్షలు నిర్వహిస్తున్న బాలకృష్ణ.. ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌తో పలువురు చనిపోయారని, కొందరికి గుండెపోటు రాగా, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాలను తానే స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు.

ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. `నేను వస్తున్నా.. నేను ముందుంటా` అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇకపై తెలుగువాడి సత్తా ఏంటో చూపిద్దామన్నారు. జగన్‌ కేవలం కుట్రపూరితంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని, త్వరలోనే కడిగిన ముత్యంలా బాబు బయటకు వస్తారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అనే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలంటే ఆ బాధ్య‌త లోకేష్ తీసుకోవ‌చ్చు. కానీ, బాలకృష్ణ తానే ఓదార్చేందుకు వస్తా అని చెప్పడం ఆసక్తిగా ఉంది. పైగా తానే ఇక రంగంలోకి దిగుతా అని బాలకృష్ణ అంటున్నారంటే.. చంద్రబాబు ఇప్పట్లో బయటకు రాలేరు అని భావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

First Published:  12 Sep 2023 7:36 AM GMT
Next Story