Telugu Global
Andhra Pradesh

ప్ర‌జాసేవ‌కు వెళ్లేముందు జ‌నం నాడి తెలుసుకుంటున్నా.. - క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు

స్థానిక జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ప‌రిశీలించిన రాయుడు.. పాఠ‌శాల‌లో క‌ల్పిస్తున్న వ‌స‌తులు, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాల గురించి ఆరా తీశారు.

ప్ర‌జాసేవ‌కు వెళ్లేముందు జ‌నం నాడి తెలుసుకుంటున్నా.. - క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు
X

ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం కోసం గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు తెలిపారు. బుధ‌వారం ఆయ‌న గుంటూరు జిల్లా వ‌ట్టిచెరుకూరు మండ‌లం ముట్లూరులో విలేక‌రుల‌తో మాట్లాడారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్క‌రించ‌గ‌ల‌ను, ఏయే ప‌నులు చేయ‌గ‌ల‌ననే క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని వెల్ల‌డించారు.

త్వ‌ర‌లో తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన రాయుడు.. ప్ర‌జాసేవ‌కు వెళ్లేముందు జ‌నం నాడి తెలుసుకోవాల‌ని గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ట్టు వివ‌రించారు. జిల్లాలోని ప్ర‌తి ప్రాంతం, ప్ర‌తి ఊరు ప‌ర్య‌టిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా రాయుడు తెలిపారు. నిష్ట‌గా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు.

స్థానిక జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ప‌రిశీలించిన రాయుడు.. పాఠ‌శాల‌లో క‌ల్పిస్తున్న వ‌స‌తులు, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాల గురించి ఆరా తీశారు. విద్యార్థుల‌తో క‌లిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని రాయుడు తెలిపారు.

First Published:  29 Jun 2023 5:29 AM GMT
Next Story