Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు ద‌మ్ముంటే చిత్తూరు జిల్లా నుంచే పోటీచేయాలి.. - మంత్రి రోజా స‌వాల్‌

మ‌రోప‌క్క ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీతో ఉంటాడో లేదోనన్న అనుమానం క‌లిగిందేమో.. టీడీపీతోనే ఉండాలంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప‌చ్చ ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి ద్వారా బ్లాక్ మెయిల్ చేయిస్తున్నార‌ని తెలిపారు.

చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు ద‌మ్ముంటే చిత్తూరు జిల్లా నుంచే పోటీచేయాలి.. - మంత్రి రోజా స‌వాల్‌
X

చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు ద‌మ్ముంటే చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయాల‌ని మంత్రి ఆర్కే రోజా స‌వాల్ చేశారు. తిరుప‌తిలో ఆదివారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న‌ప్పుడు నంద‌మూరి కుటుంబం గుర్తుకురాని చంద్ర‌బాబుకు, లోకేశ్‌కి.. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వారు గుర్తుకొస్తార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు, లోకేశ్‌లు టీడీపీని లాక్కున్న దొంగ‌ల‌ని, ఆ పార్టీ పెట్టిన వ్య‌క్తి మ‌న‌వడిని లోకేశ్ ఆహ్వానించ‌డం ఏంట‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్‌ల వ‌ల్ల ఏమీ ఉప‌యోగం లేద‌నే విష‌యం వారికి అర్థ‌మైంద‌ని, అందుకే జూనియ‌ర్ ఎన్టీఆర్ ను పిలుస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

యువ‌గ‌ళం పేరుతో లోకేశ్ నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర అంటేనే యువ‌త పారిపోతున్నార‌ని రోజా ఎద్దేవా చేశారు. పాద‌యాత్ర‌కు రావ‌డానికే జ‌నం భ‌య‌ప‌డుతున్నార‌ని చెప్పారు. లోకేశ్ పాద‌యాత్ర‌లో ప‌దిమంది నాయ‌కులు కూడా లేర‌ని, అది ఫెయిల్యూర్ యాత్ర అని తెలిపారు.

మ‌రోప‌క్క ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీతో ఉంటాడో లేదోనన్న అనుమానం క‌లిగిందేమో.. టీడీపీతోనే ఉండాలంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప‌చ్చ ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి ద్వారా బ్లాక్ మెయిల్ చేయిస్తున్నార‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో క‌థ‌నాలు రాస్తున్నా.. ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. చెప్పు ఎందుకు చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

First Published:  27 Feb 2023 2:41 AM GMT
Next Story