Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణకు దమ్ముంటే అన్ స్టాపబుల్ కు లక్ష్మీపార్వతిని పిలవాలి.. వైసీపీ నేత ట్వీట్ వైరల్

అన్ స్టాపబుల్ షోకు బాలయ్య చంద్రబాబును ఆహ్వానించడంపై ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ ఛార్జి దేవేంద్రరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

బాలకృష్ణకు దమ్ముంటే అన్ స్టాపబుల్ కు లక్ష్మీపార్వతిని పిలవాలి.. వైసీపీ నేత ట్వీట్ వైరల్
X

అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో అన్ స్టాపబుల్ పేరిట ఒక షోని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హోస్టుగా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో ఒక సీజన్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో సీజన్ త్వరలో మొదలుకానుంది. రెండో సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం అన్ స్టాపబుల్ షోలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నాడు. ఈ షోలో బామ్మర్ది, బావ సరదాగా మాట్లాడుకున్న విషయాలపై ఆహా ఓటీటీ ఒక ప్రోమోను విడుదల చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.

అన్ స్టాపబుల్ షోకు బాలయ్య చంద్రబాబును ఆహ్వానించడంపై ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ ఛార్జి దేవేంద్రరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బాలకృష్ణకు దమ్ముంటే అన్ స్టాపబుల్ షోకు లక్ష్మీపార్వతి గారిని పిలిపించి మాట్లాడించాలని ఆయన సవాల్ విసిరారు. అయితే దేవేంద్ర రెడ్డి చేసిన ట్వీట్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

'బాలకృష్ణ.. ఈ అనవసర డ్రామాలన్నీ ఎందుకు? నీకు నిజంగా అంత దమ్ముంటే అన్ స్టాపబుల్ షోకు లక్ష్మీపార్వతి గారిని పిలిపించి మాట్లాడించు. 1995లో రామారావును వెన్నుపోటు పొడిచి, చెప్పులు వేయించి అవమానించినప్పటి నుంచి మీరు.. ఏకపక్ష ప్రచారాన్ని ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు.' అని దేవేంద్రరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా రాజకీయంగా కాక పుట్టిస్తోంది.

టీడీపీ శ్రేణులు కూడా దేవేంద్రరెడ్డికి కి కౌంటర్ గా ట్వీట్లు వేస్తున్నారు. అన్ స్టాపబుల్ షో రెండు నిమిషాల ప్రోమోకే వైసీపీ నాయకులు ఇంత ఉలిక్కి పడుతున్నారెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయితే ఇంకెంత భయపడతారో అని కౌంటర్లు వేస్తున్నారు.

First Published:  12 Oct 2022 9:04 AM GMT
Next Story