Telugu Global
Andhra Pradesh

అది మీ నిరాశను సూచిస్తోంది- ఆంధ్రజ్యోతిపై ఐ- ప్యాక్

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నార‌ని ఆక్షేపించింది. ఈ కథనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పింది.

అది మీ నిరాశను సూచిస్తోంది- ఆంధ్రజ్యోతిపై ఐ- ప్యాక్
X

ప్రశాంత్ కిషోర్ టీం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది.. అందులో 25 మంత్రులకు గాను కేవలం 5 మంది మాత్రమే తిరిగే గెలవబోతున్నారు.. మిగిలిన వారంతా ఓడితారని ఆ స‌ర్వే సారాంశం. ఆ సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో లీక్ అయిందంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ప్రశాంత్ కిషోర్ టీం అధికారికంగా స్పందించింది.


ఆంధ్రజ్యోతి కథనాన్ని పీకే టీం తీవ్రంగా ఖండించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నార‌ని ఆక్షేపించింది. ఈ కథనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పింది. ఇలాంటి ఫేక్ సర్వేలను ప్రచురించడం మీలోని నిరాశను తెలియజేస్తోందని ఐ- ప్యాక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

First Published:  27 Jan 2023 8:36 AM GMT
Next Story