Telugu Global
Andhra Pradesh

రాధా.. నీకా ధైర్యం ఉందా? - గుంటూరు వైసీపీ మేయర్ ఫైర్

''చంద్రబాబు గెలుపు కోసం తిరుగుతున్న రాధా!.. మీ తండ్రి విగ్రహానికి ఈరోజు సాయంత్రం లోపు చంద్రబాబుతో పూలమాల వేయించగలవా'' అని సవాల్ చేశారు.

రాధా.. నీకా ధైర్యం ఉందా? - గుంటూరు వైసీపీ మేయర్ ఫైర్
X

వంగవీటి రంగా కుమారుడు రాధా టీడీపీలో ఉండటంపై గుంటూరు మేయర్ మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కడుపున పుట్టిన కుమారుడు రాధా.. నేడు చంద్రబాబు పక్కన ఉండటం చూసి వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తోందన్నారు. తన తండ్రిని చంపిన చంద్రబాబు పక్షాన నిలవడం ద్వారా రంగా ఆత్మకు నిజమైన క్షోభ తెచ్చింది రాధానే అని విమర్శించారు.

చంద్రబాబు పక్కన ఉన్న రాధాను తాను అడుగుతున్నానని.. ''చంద్రబాబు గెలుపు కోసం తిరుగుతున్న రాధా!.. మీ తండ్రి విగ్రహానికి ఈరోజు సాయంత్రం లోపు చంద్రబాబుతో పూలమాల వేయించగలవా'' అని సవాల్ చేశారు. టీడీపీ కార్యాలయంలో రంగా చిత్రపటానికైనా చంద్రబాబుతో పూలమాల వేయించగలవా అని ప్రశ్నించారు.

చంద్రబాబుతో ఆ పని చేయించే ధైర్యం వంగవీటి రాధాకు లేదని కూడా మనోహర్ అన్నారు. రంగా రక్తం పంచుకుని రాధా పుట్టి ఉండవచ్చు గానీ.. ఆయన ఏనాటికి నిజమైన రాజకీయ వారసుడు కాలేరని విమర్శించారు. రంగా ఆశ‌యాల సాధ‌న‌కు నిజమైన రాజకీయ వారసుడు జగన్‌మోహన్ రెడ్డే అని గుంటూరు మేయర్ మనోహర్ వ్యాఖ్యానించారు.

First Published:  26 Dec 2022 11:30 AM GMT
Next Story