Telugu Global
Andhra Pradesh

డిప్యూటీ స్పీకర్ పై హెలికాప్టర్ తో పూల వర్షం.. ఏపీలోనే...

విజయనగరంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి ఘన స్వాగతంలభించింది. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయన మొదటి సారి విజయనగరం వెళ్ళిన సందర్భంగా ఆయనకు వేలాది మంది స్వాగతం పలికారు. 400 కార్లు, 1000 బైకులతో ర్యాలీ నిర్వహించారు.

డిప్యూటీ స్పీకర్ పై హెలికాప్టర్ తో పూల వర్షం.. ఏపీలోనే...
X

ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి విజయనగరంలో ఘన స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత తొలిసారి విజయనగరానికి కోలగట్ల రాగా.. వేలాది మంది స్వాగతం పలికారు. 400 కార్లు, 1000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. దారిపొడవున భారీగా ఫ్లెక్సీలు,బ్యానర్లు కట్టారు. గజమాలలు వేశారు.

విజయనగరంలోని పలు జంక్షన్ల మీదుగా ర్యాలీ కొనసాగింది. సుమారు నాలుగు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. రద్దీ మార్గాల్లో ర్యాలీ సాగడంతో చాలా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏకంగా హెలికాప్టర్‌ నుంచి కోలగట్లపై పూలు చల్లారు. చాలాసేపు రహదారి వెంట కోలగట్ల ర్యాలీ.. వారిపైన హెలికాప్టర్ పూలు చల్లుతూ ప్రయాణం చేసింది. ఈ హంగామా చూసి సామాన్యులు ఆశ్చర్యపోయారు.

First Published:  25 Sep 2022 4:08 PM GMT
Next Story