Telugu Global
Andhra Pradesh

మాపైకి లోకేష్‌ గూండాలను పంపాడు.. - ఎంపీ కేశినేని నాని

పేదలను ధనికులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కేశినేని నాని చెప్పారు.

మాపైకి లోకేష్‌ గూండాలను పంపాడు.. - ఎంపీ కేశినేని నాని
X

తిరువూరులో తనపైకి, స్వామిదాస్‌ పైకి లోకేష్‌ గూండాలను పంపాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. తిరువూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో ఈ ఏడాది జనవరి మూడో తేదీనే పునాది పడిందని తెలిపారు. చంద్రబాబు కోసం తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లని ఈ సందర్భంగా కేశినేని నాని వెల్లడించారు.

పేదలను ధనికులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కేశినేని నాని చెప్పారు. తన భావజాలం, సీఎం జగన్‌ భావజాలం ఒక్కటేనని.. ముక్కు సూటితనమని ఆయన తెలిపారు. విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నిజమైన అంబేడ్క‌ర్‌ వాదిగా సీఎం జగన్‌ నిలిచారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధానిని ఏర్పాటుచేసింది లోకేష్‌ కోసమేనని ఆయన తెలిపారు. చంద్రబాబుకు రోడ్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కావాలని, సీఎం జగన్‌కి మాత్రం పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికులను చేయడం కావాలని నాని చెప్పారు.

First Published:  26 Jan 2024 3:28 AM GMT
Next Story