Telugu Global
Andhra Pradesh

175 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపే ద‌మ్ము నీకుందా..?

స్కాములకు పాల్పడిన చంద్రబాబుతో మిలాఖత్‌ అయిన పవన్‌ తన చేష్టలకు సిగ్గుపడాలని వెలంపల్లి, మల్లాది విమర్శించారు.

175 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపే ద‌మ్ము నీకుందా..?
X

విడ‌త‌ల వారీగా చేప‌డుతున్న పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నిన్న‌ అవ‌నిగ‌డ్డ నుంచి ప్రారంభ‌మైంది. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 175 సీట్లు కాదని, 15 సీట్లు మాత్రమేనని పవన్‌ వ్యాఖ్యానించడంపై వారు మండిపడ్డారు. 15 సీట్లలో మాత్రమే పోటీచేయగలిగే పరిస్థితి ఉన్న పవన్‌ కల్యాణ్‌.. వైసీపీకి 15 సీట్లు మాత్రమే వస్తాయంటూ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.

పవన్‌కు నిజంగా దమ్ముంటే 175 సీట్లలో తన అభ్యర్థులను పోటీలో నిలిపి.. అప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్ విసిరారు. స్కాములకు పాల్పడిన చంద్రబాబుతో మిలాఖత్‌ అయిన పవన్‌ తన చేష్టలకు సిగ్గుపడాలని వెలంపల్లి, మల్లాది విమర్శించారు. జ‌న‌సేన‌, టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు కుంభకోణాలపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని వారు నిలదీశారు.

First Published:  2 Oct 2023 6:59 AM GMT
Next Story