Telugu Global
Andhra Pradesh

నీ పార్టీ నాశనం అయిపోతుంది- పరిటాల సునీత ముందే మహిళ శాపనార్థాలు

ఒక మహిళను పరిటాల సునీత కొట్టేందుకు చేయి ఎత్తారు. ఏయ్‌... నోర్మూయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సదరు మహిళ కూడా అంతే గట్టిగా ఎదురుతిరిగారు.

నీ పార్టీ నాశనం అయిపోతుంది- పరిటాల సునీత ముందే మహిళ శాపనార్థాలు
X

వైసీపీలో చేరి తప్పు చేశానంటూ ఒక కార్యకర్త పరిటాల సునీత కాళ్ల మీద పడ్డారంటూ ఒక వీడియో మంగళవారం మీడియాలో బాగా వైరల్ అయింది. రాప్తాడు మండలం మరూరు గ్రామంలో పరిటాల సునీత పర్యటించిన సమయంలో టీడీపీ మాజీ కార్యకర్త ఆమె కాళ్లపై పడ్డారు. టీడీపీకి ఇది సానుకూల పరిణామం అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే అదే గ్రామంలో పరిటాల సునీతకు ఊహించని షాక్ తగింది. ఆ విషయం మాత్రం మీడియాలో పెద్దగా ప్రచారానికి రావడం లేదు.

ఒక మహిళను పరిటాల సునీత కొట్టేందుకు చేయి ఎత్తారు. ఏయ్‌... నోర్మూయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సదరు మహిళ కూడా అంతే గట్టిగా ఎదురుతిరిగారు. పరిటాల సునీత అనుచరుడు కదిరప్ప.. కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో తమకు మోసం చేశారని అతడి సొంత అన్న నారాయణ కోడలు ఆదిలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పరిటాల సునీతకు వివరించేందుకు దళిత మహిళ అయిన ఆదిలక్ష్మి వచ్చారు. మీ వెంట ఉండే కదిరప్ప తమకు మోసం చేశారని ఆదిలక్ష్మీ చెప్పగా.. పరిటాల సునీత ఆగ్రహించారు. అతడు అలాంటి వ్యక్తి కాదంటూ ఆదిలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ''ఏయ్‌'' అంటూ కొట్టేందుకు పరిటాల సునీత చేయి ఎత్తారు.

ఆదిలక్ష్మి కూడా అంతే తీవ్రంగా స్పందించారు. న్యాయం చేయమని అడిగితే బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి మోసగాళ్లను వెంటేసుకుని తిరిగితే మీ పార్టీ నాశనం అయిపోతుందని ఆదిలక్ష్మి పరిటాల సునీత ముందే శాపనార్థాలు పెట్టారు.

First Published:  28 Dec 2022 3:16 AM GMT
Next Story