Telugu Global
Andhra Pradesh

ఎదురొస్తే ఎగేసి నరుకుతాం- కొడాలి అనుచరుల ఫ్లెక్సీలు

''మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి ఎవరైనా వస్తే.. ఎగరేసి నరుకుతాం''అంటూ నివాదాలు రాశారు. ఫ్లెక్సీపై కొడాలి నాని, సీఎం జగన్, వైఎస్‌ఆర్ ఫొటోలను ముద్రించారు. రెడ్డిపాలెం యువదళం పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఎదురొస్తే ఎగేసి నరుకుతాం- కొడాలి అనుచరుల ఫ్లెక్సీలు
X

గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదం అయింది. గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అమరావతివాదుల పాదయాత్ర ప్రవేశిస్తున్న సమయంలోనే ఈ ఫ్లెక్సీ వేశారు.

''మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి ఎవరైనా వస్తే.. ఎగరేసి నరుకుతాం''అంటూ నివాదాలు రాశారు. ఫ్లెక్సీపై కొడాలి నాని, సీఎం జగన్, వైఎస్‌ఆర్ ఫొటోలను ముద్రించారు. రెడ్డిపాలెం యువదళం పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

తమను రెచ్చగొట్టేందుకే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని అమరావతి జేఏసీ అభ్యంతరం తెలిపింది. ఫ్లెక్సీలో హెచ్చరికలు వివాదాస్పదంగా ఉండడంతో దాన్ని పోలీసులు తొలగించారు.

First Published:  24 Sep 2022 3:01 AM GMT
Next Story