Telugu Global
Andhra Pradesh

ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. ఇటీవలే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం

ఇటీవలే పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి నిశ్చితార్ధం జరిగింది. జనవరిలో తిరుమల వేదికగా వీరి వివాహం జరగ‌నుంది.

ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. ఇటీవలే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం
X

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇబ్బంది ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు.

ఇటీవలే పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి నిశ్చితార్ధం జరిగింది. జనవరిలో తిరుమల వేదికగా వీరి వివాహం జరగ‌నుంది. పెళ్లి పత్రికలను పంచేందుకు చెన్నైలోని బంధువుల నివాసానికి వెళ్లిన సమయంలో తనకు గుండెలో నొప్పిగా ఉందని చంద్రమౌళి చెప్పారు. దాంతో అతడి స్నేహితుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మామ‌ శేఖర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లారు.

చంద్రమౌళికి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చిందని.. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పనిలేదని బంధువులు వివరించారు. చంద్రమౌళి వయసు 28ఏళ్లు.

First Published:  19 Dec 2022 2:01 AM GMT
Next Story