Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలోనూ ఈడీ బృందం ఒకటి తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ లోతీ రోడ్డులో ఉన్న బంగ్లా నెంబర్‌ 95లో సోదాలు నిర్వహిస్తున్నారు.

వైసీపీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
X

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి.

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలోనూ ఈడీ బృందం ఒకటి తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ లోతీ రోడ్డులో ఉన్న బంగ్లా నెంబర్‌ 95లో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, హైదరాబాద్‌లోని మాగుంట నివాసాలతో పాటు చెన్నైలోని బాలాజీ లిక్కర్ కంపెనీ ఆఫీసులో కూడా ఈడీ సోదాలు చేస్తోంది.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో ఉంది. వీరికి ఒక ప్రముఖ బ్రాండ్ లిక్కర్‌ కంపెనీ ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న ఒక్క సంస్థతో కలిసి మాగుంటకు చెందిన కంపెనీ సిండికేటుగా మారి ఢిల్లీ లిక్కర్ టెండర్లలో పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాగుంట నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది.

First Published:  16 Sep 2022 7:37 AM GMT
Next Story