Telugu Global
Andhra Pradesh

తూర్పుగోదావరి జిల్లా: కోడి పందాల్లో విషాదం... కోడి కత్తి గుచ్చుకొని వ్యక్తి మృతి!

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాలికి కత్తి కట్టిన ఓ పందెం కోడి పద్మారావు అనే వ్యక్తి మెడను కోసేసింది. దాంతో అతను రక్తం మడుగులో పడిపోయాడు.

తూర్పుగోదావరి జిల్లా: కోడి పందాల్లో విషాదం... కోడి కత్తి గుచ్చుకొని వ్యక్తి మృతి!
X

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతంలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు భారీగా జరుగుతున్నాయి. చట్ట విరుద్దమైనప్పటికీ కోళ్ళ పందాలనుపోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఒక వైపు ప్రజలు ఈ పందాల్లో హుషారుగా పాల్గొంటూండగా తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోడి కత్తి గుచ్చుకొని రెండు గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోట్లాడుతున్న కోళ్ళు ఆ పోరాటాన్ని చూస్తున్న పద్మారావు అనే యువకుడి వైపు దూసుకొచ్చాయి. అందులో ఒక కోడికి కాలికి కట్టి పద్మారావు మోకాలిని చీల్చేసింది. ల్పలి నరం తెఫిపోవడంతో రక్తం ఆగకుండా పారింది. దాంతో అతను రక్తం మడుగులో పడిపోయాడు. అతన్ని స్థానికులు నల్ల జర్ల ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యలోనే పద్మారావు చనిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెల కొంది.

అదే విధంగా కిర్లంపూడి మండలం వేలంకలో గుండే సురేష్ అనే వ్యక్తి, కోడి కాలికి కత్తి కడుతుండగా ఆ కత్తి గుచ్చుకొని మరణించాడు.

First Published:  15 Jan 2023 11:12 AM GMT
Next Story