Telugu Global
Andhra Pradesh

12 ప్రశ్నలు..వన్‌ వర్డ్‌ ఆన్సర్‌ ఇవ్వండి

తాజాగా ట్విట్టర్‌లో 12 ప్రశ్నలు సంధించారు. చంద్రబాబును సమర్థించే వాళ్లెవరైనా.. ఈ 12 ప్రశ్నలకు వన్‌ వర్డ్‌లో అవునా.. కాదా అనే ఫార్మాట్‌లో సమాధానాలు ఇవ్వాలని కోరారు.

12 ప్రశ్నలు..వన్‌ వర్డ్‌ ఆన్సర్‌ ఇవ్వండి
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి వరుస ట్వీట్లతో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతున్నారు డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా ట్విట్టర్‌లో 12 ప్రశ్నలు సంధించారు. చంద్రబాబును సమర్థించే వాళ్లెవరైనా.. ఈ 12 ప్రశ్నలకు వన్‌ వర్డ్‌లో అవునా.. కాదా అనే ఫార్మాట్‌లో సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఈ ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టేనని ట్వీట్ చేశారు.

రామ్‌ గోపాల్‌ వర్మ అడిగిన ప్రశ్నలు ఇవే..

1. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్.‌..... అవునా ?

2. ఈ ఫేక్‌ ఒప్పందంతోనే రూ.300 కోట్లకు పైగా ఇచ్చేశారు.. అవునా..?

3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఈ డబ్బు రిలీజ్ చేయడానికి అన్ని రూల్స్‌ని ఉల్లంఘించారు. డబ్బు విడుదల కోసం అధికారుల అబ్జెక్షన్స్‌ని పెడచెవిన పెట్టారు..అవునా.?

4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, సీమెన్స్‌ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పింది… అవునా ?

5. 90శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్దలేదని సీమెన్స్‌ చెప్పింది….అవునా ?

6. ఈ మేరకు సెక్షన్‌ 164 CRPC కింద జడ్జి ఎదుట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాధికారులు, సీమెన్స్‌ అధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు…అవునా ?

7. రిలీజ్‌ చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన బాధ్య‌త ఏపీ ప్రభుత్వానికి వుంది ..అవునా ?

8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన బాధ్య‌త ప్రభుత్వానికి వుంది…అవునా ?

9. రూ. 300 కోట్లకుపైగా డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు.….అవునా ?

10. స్కిల్‌ కేసులో ED దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిన విషయాన్ని ఈడీ స్వయంగా తన అకౌంట్ ద్వారా ట్వీట్ చేసింది. అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ అయిన ED.. ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు…అవునా?

11. విజయవాడలోని ACB కోర్టు దాదాపు 10 గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది… అవునా ?

12. ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబుగారి చేతిలోకి వెళ్లిందనే విషయం ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో, అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి చంద్రబాబుకు చేరిందని ED చెప్తోంది.…అవునా ? ఒక వేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు..?

ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకి అవునని సమాధానమిచినట్టే.!


ఇక మరో ట్వీట్‌లో తెలుగుదేశం, జనసేన పొత్తుపై పరోక్షంగా సెటైర్ వేశారు ఆర్జీవీ. సహజీవనం చేస్తున్న ఓ జంట.. ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేసిందంటూ ట్వీట్ చేశారు. ఏ సందర్భాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశానో చెప్పగలరా అంటూ ఓ ప్రశ్న కూడా వదిలేశాడు.

First Published:  15 Sep 2023 12:55 PM GMT
Next Story