Telugu Global
Andhra Pradesh

సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన రామ్‌గోపాల్‌వ‌ర్మ‌

సీఎం క్యాంప్ ఆఫీసులో కాకుండా సీఎం స్వ‌గృహంలో రామ్‌గోపాల్ వ‌ర్మ జ‌గ‌న్‌ని క‌లిశారు. ఆయ‌న‌తో క‌లిసి లంచ్ కూడా చేసిన‌ట్టు తెలిసింది.

సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన రామ్‌గోపాల్‌వ‌ర్మ‌
X

సంచ‌ల‌న సినీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బుధ‌వారం క‌లిశారు. గ‌తంలోనూ సినిమా టిక్కెట్ల వివాదం నేప‌థ్యంలో ఆయ‌న సీఎం వైఎస్ జ‌గ‌న్‌ని క‌లిసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏయే అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించి ఉంటారు.. అనే అంశం అంద‌రిలోనూ ఆసక్తి నెల‌కొంది.

సీఎం క్యాంప్ ఆఫీసులో కాకుండా సీఎం స్వ‌గృహంలో రామ్‌గోపాల్ వ‌ర్మ జ‌గ‌న్‌ని క‌లిశారు. ఆయ‌న‌తో క‌లిసి లంచ్ కూడా చేసిన‌ట్టు తెలిసింది. గ‌తంలో సినిమా టిక్కెట్ల వివాదం నేప‌థ్యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను చిరంజీవి, మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌, నాగార్జున త‌దిత‌రులంతా క‌లిసిన అనంత‌రం రామ్‌గోపాల్‌వ‌ర్మ సినిమా టిక్కెట్ల విష‌య‌మై విడిగా క‌లిసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో మంత్రి పేర్ని నానిని కూడా క‌లిసి రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా టిక్కెట్ల విష‌యమై చ‌ర్చించారు.

అయితే.. తాజాగా ఆయ‌న సీఎం వైఎస్ జ‌గ‌న్‌ని ఎందుకు క‌లిశార‌నే విష‌య‌మై ఇంకా ఏ విష‌య‌మూ బ‌య‌టికి రాలేదు. సినిమా విష‌యాల‌పైనే క‌లిశారా.. లేక త‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌కు సంబంధించి క‌లిశారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై క్యాంప్ ఆఫీస్ వ‌ర్గాల నుంచి ఎలాంటి స‌మాచారం బ‌య‌టికి రాలేదు. దీనిని బ‌ట్టి చూస్తే ఇది పూర్తిగా ప్రైవేటు మీటింగ్‌లా క‌నిపిస్తోంది. అయితే.. ఇది సినిమాల‌కు సంబంధించిన అంశంపైనే క‌లిసి ఉంటార‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

First Published:  26 Oct 2022 10:56 AM GMT
Next Story