Telugu Global
Andhra Pradesh

ఎంపీ మాధ‌వ్‌పై ఢిల్లీలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఫిర్యాదులు

ఎంపీ మాధవ్ వీడియోపై ద‌ర్యాప్తు జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకి విన్న‌వించ‌నున్నామ‌ని జేఏసీ తెలిపింది. స్పీకర్ ఓం బిర్లాని క‌లిసి గోరంట్ల‌ మాధవ్ పార్ల‌మెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతామ‌ని వారు వివ‌రించారు.

ఎంపీ మాధ‌వ్‌పై ఢిల్లీలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఫిర్యాదులు
X

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ చేరుకుంది వివిధ మహిళా సంఘాల నేతలతో క‌లిసి ఉన్న డిగ్నిటీ ఫర్ ఉమెన్ జాయింట్ యాక్షన్ కమిటీ. డిగ్నిటీ ఫర్ ఉమెన్ కన్వీనర్ చెన్నుపాటి కీర్తి, కోకన్వీనర్ అనిత, కమిటీ మెంబర్ సుంకర పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య‌ సెక్రటరీ రాణి, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ట్రెజరర్ పుణ్యవతి, టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జ్యోత్స్నలతో కూడిన జేఏసీ బృందం రాష్ట్రపతి, లోక్‌స‌భ స్పీకర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్, మహిళా ఎంపీలను క‌ల‌వ‌నుంది.

ఎంపీ మాధవ్ వీడియోపై ద‌ర్యాప్తు జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకి విన్న‌వించ‌నున్నామ‌ని జేఏసీ తెలిపింది. స్పీకర్ ఓం బిర్లాని క‌లిసి గోరంట్ల‌ మాధవ్ పార్ల‌మెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతామ‌ని వారు వివ‌రించారు. గోరంట్ల మాధవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే న్యాయం కోసం ఢిల్లీ వ‌చ్చి ఫిర్యాదు చేస్తున్నామ‌ని జేఏసీ నేత‌లు వివ‌రించారు.

First Published:  22 Aug 2022 9:20 AM GMT
Next Story