Telugu Global
Andhra Pradesh

జగన్‌ అనే నేను.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు. జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు.

జగన్‌ అనే నేను.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్
X

2019 అసెంబ్లీ ఎన్నికల ముందు బైబై బాబు నినాదంతో హోరెత్తించిన వైసీపీ.. రాబోయే 2024 ఎన్నికల కోసం మరో వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఇందుకోసం వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి 73 రోజుల టైం ఉందంటూ బోర్డు ఏర్పాటు చేసింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు. జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు సిద్ధం, జగన్‌ అనే టైటిల్స్‌తో బోర్డు ఏర్పాటు చేశారు.

ఈ బోర్డును పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జోగి రమేష్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశమంతా ఏపీ వైపు చూస్తోందని, జగన్‌ లాంటి సీఎం, నాయకుడు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు జోగి రమేష్‌.

First Published:  12 March 2024 8:26 AM GMT
Next Story