Telugu Global
Andhra Pradesh

నువ్వా.. నేనా? - తాడికొండలో ఆ ఇద్దరు నేతల పోరు

ఇటీవల తాడికొండ సమన్వయకర్తగా డొక్కాను నియమించడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు శ్రీదేవి అనుచరులు నిరసనలు చేపట్టారు. అయితే అధిష్టానం మాత్రం శ్రీదేవి పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

నువ్వా.. నేనా? - తాడికొండలో ఆ ఇద్దరు నేతల పోరు
X

గుంటూరు జిల్లా తాడికొండలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరుకుంది. ఇవాళ ఇరువురు నేతల వర్గీయులు తాడికొండలో ర్యాలీ చేపట్టారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించుకోవడం.. ఎదురురెదురుగా ర్యాలీలు రావడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. తాడికొండలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని ఇరువర్గాలకు పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. మొత్తంగా తాడికొండ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల తాడికొండ సమన్వయకర్తగా డొక్కాను నియమించడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు శ్రీదేవి అనుచరులు నిరసనలు చేపట్టారు. అయితే అధిష్టానం మాత్రం శ్రీదేవి పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. గతంలో ఆమె అనుచరుల మీద పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పేకాట శిబిరాలు నిర్వహించడం .. సహా పలు ఆరోపణలు వచ్చాయి.

ఇదిలా ఉంటే మరోసారి వివాదం నెలకొన్నది. ఇప్పటికే డొక్కా ప్రెస్ మీట్ పెట్టి తాము కలిసి పనిచేసుకుంటామని ప్రకటించారు. అయినప్పటికీ శ్రీదేవి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ వివాదాన్ని వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

First Published:  27 Aug 2022 9:21 AM GMT
Next Story