Telugu Global
Andhra Pradesh

ఇవాళ జగన్‌ బస్సు యాత్రకు విరామం.. ఎందుకంటే.?

మార్చి 27న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన జగన్‌.. నెల్లూరు జిల్లాలో ప్రవేశించారు.

ఇవాళ జగన్‌ బస్సు యాత్రకు విరామం.. ఎందుకంటే.?
X

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్‌ జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డిపాలెం దగ్గర క్యాంప్‌లో జగన్ బస చేయనున్నారు. ఈ రోజు పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమవుతారు.

ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ముఖ్య నేతలతో చర్చలు జరుపుతారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. చింతారెడ్డిపాలెం క్యాంప్ సైట్‌కు రావాలని ఇప్పటికే ముఖ్య నేతలందరికీ ఆదేశాలు జారీ చేసింది పార్టీ.

మార్చి 27న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన జగన్‌.. నెల్లూరు జిల్లాలో ప్రవేశించారు. ప్రతి రోజు వివిధ వర్గాల వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు.

First Published:  5 April 2024 5:08 AM GMT
Next Story