Telugu Global
Andhra Pradesh

జనంలోకి జగన్‌.. ఈ నెల 25న విశాఖకు!

రోజుకు రెండు జిల్లాల చొప్పున మొత్తం 26 జిల్లాలను కవర్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ఖరారవుతోందని సమాచారం.

జనంలోకి జగన్‌.. ఈ నెల 25న విశాఖకు!
X

2024 అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్‌. ఇప్పటికే పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుతో ఏపీలో పొలిటికల్‌ హీట్ పెంచేసిన జగన్‌...ఇక త్వరలోనే జిల్లాల పర్యటనకు బయల్దేరనున్నారు. జనవరి 25న ఆయన జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. రోజుకు రెండు జిల్లాల చొప్పున మొత్తం 26 జిల్లాలను కవర్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ఖరారవుతోందని సమాచారం. ఈ నెల 25న విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించే రీజనల్ క్యాడర్ సమావేశానికి జగన్ హాజరుకానున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటివరకూ మూడు విడతల్లో 9 ఎంపీ స్థానాలతో పాటు 59 మంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. త్వరలోనే నాలుగో జాబితా కూడా విడుదల చేయనున్నారు. మరో 16 ఎంపీ స్థానాలతో పాటు 125 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు జగన్‌. గెలుపు అవకాశాలున్న వారికే నియోజకవర్గాల బాధ్యత అప్పగిస్తున్నారు. పార్టీకి ఎంతటి విధేయులైనప్పటికీ..గెలిచే అవకాశాలు లేకపోతే పక్కన పెడుతున్నారు. టికెట్‌ నిరాకరించినవారిలో పలువురు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటుండగా..మెజార్టీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు.

First Published:  12 Jan 2024 2:41 PM GMT
Next Story