Telugu Global
Andhra Pradesh

ఈ ప్రాంతం నా ప్రాణం.. పులివెందులలో జగన్ నామినేషన్

పులివెందుల మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లి అక్కడ నామినేషన్ పత్రాలు సమర్పించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ ప్రాంతం నా ప్రాణం.. పులివెందులలో జగన్ నామినేషన్
X

ఏపీలో నామినేషన్ల కార్యక్రమానికి ఇవాళే చివరి రోజు. చివరి రోజున పులివెందులలో సీఎం జగన్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. జగన్ నామినేషన్ సందర్భంగా ఆ ప్రాంతమంతా జై జగన్ నినాదాలతో మారుమోగింది. పులివెందుల జన సముద్రంగా మారింది.

పులివెందుల మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లి అక్కడ నామినేషన్ పత్రాలు సమర్పించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల తన ప్రాణం అని అన్నారు జగన్. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.

నేడే మేనిఫెస్టో..?

వైసీపీ మేనిఫెస్టోపై ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈరోజు నామినేషన్ సందర్భంగా జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని అనుకున్నారంతా. అయితే నామినేషన్ కి ముందు జరిగిన బహిరంగ సభలో ఆ ప్రస్తావన లేదు. నామినేషన్ కార్యక్రమం పూర్తయింది కాబట్టి.. మేనిఫెస్టోపై ప్రకటన ఈరోజు ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక నామినేషన్ సందర్భంగా జగన్ ఆసక్తికర ట్వీట్ వేశారు. ఆంధ్రప్రదేశ్ సిద్ధం..! అంటూ ట్వీట్ చేశారు జగన్.



First Published:  25 April 2024 7:03 AM GMT
Next Story