Telugu Global
Andhra Pradesh

కుమారీ ఆంటీకి జగన్‌ సాయం.. వైరల్‌గా మారిన వీడియో

ఓ యూట్యూబ్‌ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారీ ఆంటీ.. తనకు ఊళ్లో ఏపీ సీఎం జగన్‌ ఇచ్చిన ఇల్లు తప్ప మరేమీ లేదని చెప్పుకొచ్చారు.

కుమారీ ఆంటీకి జగన్‌ సాయం.. వైరల్‌గా మారిన వీడియో
X

కుమారీ ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్‌మీడియాలో ఈమె పేరే వినిపిస్తోంది. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేసుకునే కుమారీ ఆంటీ.. ఇప్పుడు మీమర్స్ పుణ్యమా అని సోషల్‌మీడియాలో సంచలనంగా మారారు. సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో గతంలో రోజుకు 300 ప్లేట్లు భోజనం అమ్మిన కుమారీ ఆంటీ, ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు బిజినెస్ చేస్తున్నారు. దీంతో కుమారీ ఆంటీ బాగా సంపాదిస్తోందంటూ ప్రచారం మొదలైంది.


ఈ నేపథ్యంలోనే కుమారీ ఆంటీకి చెందిన మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ యూట్యూబ్‌ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారీ ఆంటీ.. తనకు ఊళ్లో ఏపీ సీఎం జగన్‌ ఇచ్చిన ఇల్లు తప్ప మరేమీ లేదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను వైసీపీ కార్యకర్తలు తెగ వైరల్‌ చేస్తున్నారు. సామాన్యులకు జగనన్న చేసిన మేలుకు ఇదే సాక్ష్యమంటున్నారు.

వైసీపీ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేసింది. సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ చెప్తే వెటకారం చేసిన పెత్తందారులకు దాసరి సాయి కుమారి అలియాస్ కుమారీ ఆంటీ దిమ్మతిరిగిపోయేలా చేశారంటూ రాసుకొచ్చింది. మంచి చేస్తే గుర్తింపు ఇలానే ఉంటుందని.. ఇప్పుడైనా అర్థమైందా అంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌ ఖాతాలను ట్యాగ్ చేసింది.

First Published:  30 Jan 2024 12:13 PM GMT
Next Story