Telugu Global
Andhra Pradesh

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనుండగా, గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే
X

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తరఫు అభ్యర్థులను సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ఖరారు చేశారు. ఎంపికైన ముగ్గురు అభ్యర్థుల్లో మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో జగన్‌ను కలిసి తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనుండగా, గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 16న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 20వ తేదీ వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా గురువారం విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 29లోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

First Published:  9 Feb 2024 3:21 AM GMT
Next Story