Telugu Global
Andhra Pradesh

సత్తెనపల్లి టీడీపీలో మూడు వర్గాల పోరు

సత్తెనపల్లి టీడీపీలో మూడు వర్గాల పోరు
X

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్న క్యాంటీన్ ఏర్పాటు టీడీపీలో మూడు వర్గాల వివాదంగా మారింది. టీడీపీ యువనేత అబ్బూరి మల్లి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనిపై వివాదం మొదలు కాగా, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అంతా కలిసి ఒకే క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు పెద్దలు. ఇంతలోనే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్యాంటీన్ ప్రారంభించడానికి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హాజరు అయ్యారు.

సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం వైవీ ఏర్పాటు చేసిన క్యాంటీన్ కి పోటీగా కోడెల శివరాం అన్న క్యాంటీన్ త్వరలో ఆరంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. కోడెల శివరాం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను తీసివేయడానికి వైవీ ఆంజ‌నేయులు వర్గీయులు ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

First Published:  5 Sep 2022 8:20 AM GMT
Next Story