Telugu Global
Andhra Pradesh

లోకేష్ కి ఓనమాలు నేర్పింది నేనే.. నాక్కూడా వెన్నుపోటు పొడిచారు

లోకేష్ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. 2012లో లోకేష్‌ కు రాజకీయాలలో ఓనమాలు నేర్పింది తానేనని, చిత్తూరు జిల్లా నాయకులతో లోకేష్‌ కి పరిచయ కార్యక్రమం పెట్టించానని గుర్తు చేశారు.

లోకేష్ కి ఓనమాలు నేర్పింది నేనే.. నాక్కూడా వెన్నుపోటు పొడిచారు
X

లోకేష్ కి రాజకీయ ఓనమాలు నేర్పింది తానేనంటూ మీడియా ముందుకొచ్చారు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పటిష్టతకు తాను ఎంతగా కృషి చేశానో అందరికీ తెలుసన్నారు. అదే సమయంలో తనకు కూడా ఎన్టీఆర్ లాగే టీడీపీలో వెన్నుపోటు పొడిచారని చెప్పుకొచ్చారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా సడన్ గా చిత్తూరు ఎమ్మెల్యే తెరపైకి రావడం, అందులోనూ లోకేష్ కి రాజకీయాలు నేర్పింది తానేనని చెప్పుకోవడం చర్చనీయాంశమైంది.

లోకేష్ అసమర్థుడు..

చిత్తూరు నియోజకవర్గంలో యువగళం యాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో.. లోకేష్ తన పాదయాత్రను మధ్యాహ్నం మొదలు పెట్టి, రెండు గంటల్లోనే ముగించారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే జంగాలపల్లి. లోకల్ లీడర్లు పేపర్‌లో రాసిచ్చిన అభాండాలను చదివి వినిపించడం మినహా లోకేష్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. 2012లో లోకేష్‌ కు రాజకీయాలలో ఓనమాలు నేర్పింది తానేనని, చిత్తూరు జిల్లా నాయకులతో లోకేష్‌ కి పరిచయ కార్యక్రమం పెట్టించానని గుర్తు చేశారు. అయితే ఆ పరిచయ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయని అసమర్థుడు లోకేష్ అని దుయ్యబట్టారు.

చిత్తూరులో టీడీపీని పటిష్ట పరిచింది తమ కుటుంబమేనని అన్నారు ఎమ్మెల్యే జంగాలపల్లి. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచినట్టే తనకు కూడా సీటిస్తానని చెప్పి చివరి నిమిషంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. లోకేష్ బుడ్డి పాలు తాగే చంటోడు అంటూ సెటైర్లు వేశారు. చిత్తూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, పాల డైరీని మూసివేయించిన చంద్రబాబుకి రైతుల ఉసురు తగులుతుందని అన్నారు.

First Published:  9 Feb 2023 11:32 AM GMT
Next Story