'జైలుకెళ్లండి...యోధులుగా గుర్తిస్తాం' టిడిపి కేడర్, లీడర్లకు అధినేత చంద్రబాబు పిలుపు
అక్రమ కేసుల్లో అరెస్టయి జైలుకెళ్లిన వారిని పార్టీ కోసం పోరాడిన యోథులుగా గుర్తిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
అక్రమ కేసుల్లో అరెస్టయి జైలుకెళ్లిన వారిని పార్టీ కోసం పోరాడిన యోథులుగా గుర్తిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ముందస్తు అరెస్టులు అవుతున్న కొందరు నేతల తీరుని ఆక్షేపించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న కార్యకర్తలు, సోషల్మీడియా కార్యకర్తలను వైసీపీ సర్కారు అక్రమంగా అరెస్టు చేయిస్తున్నా వెన్నుచూపకుండా పని చేస్తున్నారని కితాబిచ్చారు.
టిడిపిలో కొందరు కీలక నేతలు పార్టీ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఇంట్లోనుంచి బయటకు రాకుండా, ముందస్తు అరెస్టయ్యామంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఇంటికొచ్చినా హౌస్ అరెస్టయ్యామని తమకు తామే ప్రకటన ఇచ్చేసుకుని, టిడిపి పిలుపునిచ్చిన కార్యక్రమంతో తమకి పనిలేదనుకునే కొందరు నేతల తీరు సరికాదన్నారు. గృహనిర్బంధానికి పోలీసులు ఇంటికొస్తే బీదఅరుపులు కాదు, గట్టిగా నిలదీయండని పిలుపునిచ్చారు.