Telugu Global
Andhra Pradesh

జేసీ బ్రదర్స్ కు చంద్రబాబు షాకిచ్చారా?

వచ్చే ఎన్నికలకు సంబందించి జేసీ బ్రదర్స్ కు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారట.

జేసీ బ్రదర్స్ కు చంద్రబాబు షాకిచ్చారా?
X

వచ్చే ఎన్నికలకు సంబందించి జేసీ బ్రదర్స్ కు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారట. వచ్చేఎన్నికల్లో తమ ఫ్యామిలీకి రెండు టికెట్లు, మద్దతుదారులకు మరో రెండు టికెట్లు అడిగారట. అయితే ఫ్యామిలీకి కేవలం ఒక్కటంటే ఒక్క టికెట్ మాత్రమే ఇస్తానని, ఇక మద్దతుదారుల సంగతిని వదిలేయమని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారని పార్టీవర్గాల సమాచారం. రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ వారసులకు టికెట్లివ్వాలని బ్రదర్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

అలాగే గుంతకల్, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కూడా తమ మద్దతుదారులకు టికెట్లు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా అంత టూర్ చేసి పార్టీని బలోపేతం చేస్తానంటు మాజీ ఎంఎల్ఏ, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమధ్య నానా గోల చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని చంద్రబాబు చెప్పినా జేసీ బ్రదర్స్ పట్టించుకోవటంలేదు.

ఈ నేపధ్యంలోనే ఈమధ్య బ్రదర్స్ చంద్రబాబుతో భేటీ అయ్యారట. టికెట్ల విషయం ప్రస్తావనకు రాగానే తాడిపత్రిలో మాత్రమే టికెట్ ఇస్తానని మిగిలిన నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా చెప్పేశారట. పార్టీకి వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమైనవి కాబట్టి తాను ఒక ఫార్ములా ప్రకారం టికెట్ల కేటాయింపు చేయాల్సుంటుందని చెప్పేశారట. ఇదే సమయంలో జేసీ మేనల్లుడు దీపక్ రెడ్డి రాయదుర్గం టికెట్ ను ఆశిస్తున్నారు.

అయితే రాయదుర్గంలో మాజీమంత్రి కాలువ శ్రీనివాసులున్నారు. కాబట్టి రాయదుర్గం టికెట్ సాధ్యంకాదని చెప్పి నెల్లూరులో అవకాశముంటే టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారట. అయితే దీపక్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంపై దృష్టిపెట్టారనే విషయంలో క్లారిటీలేదు. మొత్తానికి జేసీ బ్రదర్స్ కు చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఇపుడు చెప్పిన మాటమీదే చంద్రబాబు చివరి వరకు నిలబడతారా అన్నదే అందరిలోను అనుమానం.

First Published:  4 Oct 2022 7:13 AM GMT
Next Story