Telugu Global
Andhra Pradesh

బాలయ్యకు కూడా బురద అంటించిన బావయ్య

ఇంతకాలం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు మాత్రమే అని జనాలు అనుకుంటున్నారు. అయితే వెన్నుపోటు పొడిచింది తానొక్కడినే కాదని.. తనతో పాటు నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ కూడా ఉన్నారని చంద్రబాబు జనాలందరికీ తెలిసేట్లు చేశారు.

బాలయ్యకు కూడా బురద అంటించిన బావయ్య
X

ఇంతకాలం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబునాయుడు మాత్రమే అని జనాలు అనుకుంటున్నారు. అయితే వెన్నుపోటు పొడిచింది తానొక్కడినే కాదని తనతో పాటు నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ కూడా ఉన్నారని చంద్రబాబు జనాలందరికీ తెలిసేట్లు చేశారు. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం జరిగిన ఎన్టీఆర్‌ వెన్నుపోటు ఎపిసోడ్ గురించి ఇప్పుడు ప్రస్తావన అవసరమేలేదు. ఎందుకంటే ఈ తరంవాళ్ళకి ఎన్టీఆర్‌ అంటే జూనియర్ ఎన్టీయార్ మాత్రమే.

అలాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని అదే పనిగా కెలుక్కుని ఇప్పటి జనాలకు కూడా తెలిసేట్లు చేసింది బాలయ్య హోస్టుగా వస్తున్న ఒక టాక్ షో. టాక్ షో టీజర్ వల్ల జరిగిందేమిటంటే అప్పట్లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు వ్యవహారాన్ని ఇప్పటి తరం కూడా యూట్యూబ్ వీడియోల్లో చూసి తరించారు. బావ, బావమరుదులు కూర్చుని అప్పట్లో మనం చేసింది తప్పా అని మాట్లాడుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండ‌దు. తనను నమ్మించి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్‌ చెప్పిన వీడియోలు యూట్యూబ్లో చాలానే ఉన్నాయి.

తాజా టాక్ షో వల్ల జనాలందరికీ తెలిసిందేమంటే చంద్రబాబుతో పాటు బాలయ్య కూడా ఎన్టీఆర్‌కు వెన్నపోటు పొడిచారని. ఎందుకంటే టాక్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ ఆ రోజు నాతో పాటు బాలకృష్ణ, హరికృష్ణ, మోహన్ రెడ్డి కలిసే ఎన్టీఆర్‌తో మాట్లాడటానికి వెళ్ళాం అని చెప్పినపుడు బాలయ్య మాట్లాడుతూ.. అవును నాకు బాగా గుర్తుంది అని చెప్పారు.

దీనివల్లే జనాలకు అర్ధమైందేమంటే చంద్రబాబుతో కలిసే తండ్రికి బాలయ్య కూడా వెన్నుపోటు పొడిచారని. వెన్నుపోటు ఎపిసోడ్‌లో తన‌కు అంటిన‌ బురదను చంద్రబాబు తన బావమరిది కమ్ వియ్యంకుడు బాలయ్యకు కూడా బాగా పులిమినట్లయ్యింది. నందమూరి హరికృష్ణ ఎలాగు లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమేలేదు. అయితే బావ, బావమరుదులు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు ఎన్ని షోలు చేసినా, ఎన్నిమాటలు చెప్పినా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందెవరు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు మాత్రమే.

First Published:  15 Oct 2022 7:03 AM GMT
Next Story