Telugu Global
Andhra Pradesh

పాఠ‌శాల‌ల్లో సెల్‌ఫోన్లు నిషేధం.. ఏపీ విద్యాశాఖ‌ నిర్ణ‌యం

యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.

పాఠ‌శాల‌ల్లో సెల్‌ఫోన్లు నిషేధం.. ఏపీ విద్యాశాఖ‌ నిర్ణ‌యం
X

స్కూల్స్‌లో సెల్‌ఫోన్ల వాడ‌కంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాఠ‌శాల విద్యాశాఖ‌ నిషేధం విధించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. విద్యార్థులు పాఠశాలలకు మొబైల్ ఫోన్లు తేవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ మెమో జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్ ఫోన్ల‌ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది.

యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది.

*

First Published:  28 Aug 2023 10:11 AM GMT
Next Story