Telugu Global
Andhra Pradesh

తండ్రి కేసును టేకప్ చేస్తే కొడుకు కేసు ఫ్రీ.. లోకేశ్‌పై విజయసాయి సెటైర్లు

రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తి కట్టించేందుకు డబ్బిచ్చి జనాన్ని తీసుకోస్తున్నారని ఆరోపించారు.

తండ్రి కేసును టేకప్ చేస్తే కొడుకు కేసు ఫ్రీ.. లోకేశ్‌పై విజయసాయి సెటైర్లు
X

ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీకొడుకుల ఆట ముగిసిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తండ్రి ఎలాగో.. కొడుకు అలాగే అంటూ ట్వీట్ చేశారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాంలో లోకేశ్‌ A-14గా చేరారన్న విజయసాయి రెడ్డి.. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న లోకేశ్‌.. ఢిల్లీ లాయర్లకు బై వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ స్కీం ఆఫర్‌ ఇవ్వాలంటూ సెటైర్ వేశారు. తండ్రి కేసును టేకప్ చేస్తే కొడుకు కేసు ఫ్రీగా పొందవచ్చన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి వరుస ట్వీట్లతో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. అంతకుముందు ట్వీట్‌లోనూ టీడీపీపై సెటైర్లు వేశారు. రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తి కట్టించేందుకు డబ్బిచ్చి జనాన్ని తీసుకోస్తున్నారని ఆరోపించారు. ఇది వాళ్లకు కొత్తేం కాదని.. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ నమ్మే పార్టీ టీడీపీ అంటూ సెటైర్ వేశారు. దోపిడీ పునాదులపైనే టీడీపీ ఏర్పడిందన్నారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో ఇప్పటికే ఏ-1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్‌.. నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది.

First Published:  27 Sep 2023 5:23 AM GMT
Next Story